విజయవాడలో 'పెద్ది' గర్జన... జూన్ 1న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
- విజయవాడలో 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
- జూన్ 1న ఇందిరా గాంధీ స్టేడియంలో ఘనంగా వేడుక
- జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
- రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్కుమార్ ప్రధాన పాత్రధారులు
- ఆంధ్రాలో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోహీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన ఈ చిత్రం ప్రమోషన్లను చిత్రబృందం దూకుడుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్, ఢిల్లీలో ప్రెస్ మీట్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు, నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జూన్ 3 నుంచి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే. రిలీజ్కు కొద్ది రోజుల ముందు విజయవాడలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
గ్రామీణ క్రీడా నేపథ్యంతో కూడిన ఈ చిత్రం ప్రమోషన్లను చిత్రబృందం దూకుడుగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్, ఢిల్లీలో ప్రెస్ మీట్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు, నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జూన్ 3 నుంచి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే. రిలీజ్కు కొద్ది రోజుల ముందు విజయవాడలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్తో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.